News March 24, 2025
పల్నాడు జిల్లాలో TODAY TOP NEWS

☞ రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం
☞ పిడుగురాళ్లలో మహిళ దారుణ హత్య
☞ నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ అనిల్
☞ మాజీ మంత్రి రజినిపై ఎమ్మెల్యే పుల్లారావు ఫైర్
☞ సత్తనపల్లి: బొలెరో వాహనం బోల్తా.. 11 మంది గాయాలు
☞ మాచర్ల- బెంగళూరు బస్ సర్వీస్ రద్దు
☞ సత్తెనపల్లిలో వృద్ధుడిని ఢీకొట్టిన బస్
Similar News
News April 21, 2025
భూ భారతి చట్టం రైతులకు భద్రత: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు ఈ చట్టం భద్రతగా ఉంటుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం అలంపూర్ పట్టణంలో ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
News April 21, 2025
కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారంటే? 1/2

పోప్ ఫ్రాన్సిస్ <<16168572>>కన్నుమూయడంతో<<>> 20 రోజుల తర్వాత నూతన క్రైస్తవ మతగురువును ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చిల సీనియర్లు(వారిని కార్డినల్స్ అని పిలుస్తారు) వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ భవనానికి వెళ్తారు. ఎన్నిక సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్, రేడియో, న్యూస్పేపర్ల వంటివేవీ అందుబాటులో ఉంచరు.
News April 21, 2025
కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారంటే? 2/2

ఎవరు పోప్ కావాలనుకుంటున్నారో కార్డినల్స్ పేపర్లో రాసి బ్యాలెట్లో వేస్తారు. స్పష్టమైన మెజార్టీ రాకపోతే వాటిని కాల్చడం ద్వారా వచ్చే నల్లటి పొగ చిమ్నీ ద్వారా బయటికి వెలువడుతుంది. ఇది ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదనేందుకు సంకేతం. మళ్లీ ఓటింగ్ జరుగుతుంది. 2/3 మెజార్టీ వచ్చినవారు పోప్గా ఎన్నికవుతారు. ఓ కెమికల్ కలిపి, ఆ బ్యాలెట్ పత్రాలను కాల్చేస్తారు. అలా వెలువడే తెల్లటి పొగ కొత్త పోప్ ఎన్నికకు చిహ్నం.