News March 18, 2025
పల్నాడు జిల్లా ఎస్పీ సూచనలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 74 మంది కుటుంబ,ఆర్థిక,ఆస్తి సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు.
Similar News
News December 3, 2025
KNR: అభివృద్ధి చేయకపోతే ఏడాదిలో రాజీనామా చేస్తా: అభ్యర్థి

గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే సంవత్సరంలో రాజీనామా చేస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చిన వైనం KNR(D) శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. మం.లోని కేశవపట్నంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థి సముద్రాల సంపత్ గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తీర్చుతానని లేదంటే రాజీనామా చేస్తానని హామీపత్రం రాసిచ్చాడు. కోతుల సమస్య, ఖబరస్తాన్కి లైటింగ్, ఆటో యూనియన్ సంఘం భవన నిర్మాణం సహా అనేక హామీలను సంపత్ ప్రకటించాడు.
News December 3, 2025
జిల్లాలో 941 సర్పంచ్, 2,927 వార్డు నామినేషన్లు

జగిత్యాల జిల్లాలో రెండో విడతకు సంబంధించి 122 గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.సత్యప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 941, వార్డు సభ్యుల స్థానాలకు 2,927 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.
News December 3, 2025
చంద్రంపేట: పూట గడవక.. అప్పు తీర్చలేక.. కార్మికుడి బలవన్మరణం

సిరిసిల్ల చంద్రంపేట పరిధిలోని జ్యోతి నగర్కు చెందిన బోడ శేఖర్ అనే నేతకార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిశ్రమ సంక్షోభంతో సొంత మగ్గాలు నడవక, కార్మికుడిగా మారి పనిచేస్తున్నా పూట గడవకపోవడం, అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పని సరిగ్గా లేకపోవడం, రూ.40లక్షల వరకు అప్పులు పెరగడంతో మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నట్లు పేర్కొన్నారు.


