News March 30, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్,ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు ☞ అమరావతి: మద్యం సేవించి వ్యక్తి మృతి☞ రాజుపాలెం: నేతి వెంకన్నకు వెన్న సమర్పించిన భక్తులు ☞ రొంపిచర్ల: ప్రభల నిర్మాణంలో రాజకీయ వివాదం ☞ సత్తెనపల్లి: గడియార స్తంభం వద్ద అన్యమత ప్రచారంపై నిరసన☞ గురజాల: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళన ☞ వినుకొండ: పంచాంగ శ్రవణంలో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ విప్

Similar News

News December 7, 2025

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.
* ఇంట్లో తయారు చేసిన స్వీట్స్​లో షుగర్​ మరీ ఎక్కువైతే.. కాస్త నిమ్మరసం కలపండి. కాస్త తీపి తగ్గుతుంది. అలాగే వెనిగర్​ కూడా వాడొచ్చు.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

News December 7, 2025

సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

image

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.