News April 5, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ, ☞ రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ తలకు గాయాలు, ☞ గురజాల: అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఫైర్, ☞ మాచర్ల: ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ, ☞ చిలకలూరిపేట: యువకుడి ఆత్మహత్య, ☞ దుర్గి: నాటు సారా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు, ☞ శావల్యాపురం: అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. 

Similar News

News October 17, 2025

TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

image

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.

News October 17, 2025

దీపావళి 5 రోజుల పండుగ అని మీకు తెలుసా?

image

దీపావళిని మనం రెండ్రోజులే జరుపుకొంటాం. కానీ ఉత్తర భారత్‌లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ ద్వితీయ వరకు.. మొత్తం 5 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. త్రయోదశి నాడు ధన్‌తేరస్‌గా కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. 14వ తిథిన నరక చతుర్ధశి, అమావాస్య రోజు దీపావళి జరుపుకొంటారు. పాడ్యమి రోజున గోవర్ధన పూజ చేసి, బలి చక్రవర్తిని పూజిస్తారు. ద్వితీయ తిథిన భాయ్ దూజ్ వేడుకలుంటాయి.

News October 17, 2025

NRML: 42 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి రాని మోహన్ రెడ్డి

image

మావోయిస్టు పార్టీలోనూ మోహన్ రెడ్డి టెక్నికల్ విభాగంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గాను కొనసాగారు. ఎంత పెద్ద నాయకుడైనా కుటుంబాన్ని, పెరిగిన ఊరిని చూడటానికి అప్పడప్పుడొచ్చిపోతుంటారని విన్నాం. కానీ 42 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన 63 ఏళ్ల మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన గ్రామానికి రాలేదు. ఇప్పుడైనా వస్తారేమో చూడాలి మరి.