News March 27, 2025

పల్నాడు జిల్లా నివేదికను సమర్పించిన కలెక్టర్ 

image

పల్నాడు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో నివేదికను కలెక్టర్ అరుణ్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. వెలగపూడి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగిన సదస్సులో జిల్లాకు సంబంధించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానం, బనకచర్లకు గోదావరి జలాల తరలింపు డిజైన్, సాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టు పరిస్థితిని తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ వివరించారు. 

Similar News

News November 28, 2025

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

image

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.

News November 28, 2025

త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

image

ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. SHARE IT

News November 28, 2025

గుత్తి రైల్వే ఉద్యోగి భార్య సూసైడ్

image

గుత్తి ఆర్ఎస్‌లోని రైల్వే ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసముండే అసిస్టెంట్ లోకో పైలట్ రాహుల్ కుమార్ సతీమణి జ్యోతి (23) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో జ్యోతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.