News March 12, 2025
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు

పల్నాడు జిల్లాలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు 1,200 మంది హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో 57 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలు జరుపుతారు అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలని డీఈవో ఎల్ చంద్రకళ ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News September 19, 2025
ఏలూరు: నంబర్ ప్లేట్లపై ఇలా రాస్తే..ఇక వాహనం సీజ్

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. నంబర్ ప్లేట్లపై వారి తాలూకా అనిరాసినా, నిబంధనలకు లోబడి లేకున్నా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వీటి తయారీదారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. నంబర్ ప్లేట్లపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని ఆయన గురువారం ఆదేశించారు.
News September 19, 2025
WGL: ఆర్ఎంపీ, పీఎంపీలపై అధికారుల కొరడా

WGL, KZP, HNK, దుగ్గొండి సహా 12 ప్రాంతాల్లో TG మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు ఛైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ గురువారం రాత్రి ఏకకాలంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది ఆర్ఎంపీ, పీఎంపీ అనధికారికంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని వారిపై కేసు నమోదు చేశామన్నారు.
News September 19, 2025
VJA: తండ్రితో వెళ్తుండగా ప్రమాదం.. కుమారుడి మృతి

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సింగినగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాటి గిరిబాబు అనే వ్యక్తి తన తండ్రితో కలిసి నడిచి వెళ్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో గిరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.