News March 12, 2025

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు

image

 పల్నాడు జిల్లాలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు 1,200 మంది హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో 57 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలు జరుపుతారు అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలని డీఈవో ఎల్ చంద్రకళ ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News February 12, 2026

హైదరాబాద్–శ్రీశైలం రైల్వే లైన్‌కు సీఎం విజ్ఞప్తి

image

హైదరాబాద్–శ్రీశైలం–మార్కాపురం కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నేరుగా రైలు సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శ్రీశైలానికి మార్కాపురం స్టేషన్ 80 కి.మీ దూరంలో ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే పర్యాటక రంగంతో పాటు ఆర్థిక రంగం వృద్ధి చెందనుంది.

News February 12, 2026

ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.

News February 12, 2026

వరంగల్: అప్పుడు 76.26%, ఇప్పుడు 78.25%

image

మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 12 మున్సిపాలిటీల్లో కలిపి 78.25శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2020 ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులకు, 18 ఏకగ్రీవం కాగా, 182 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 2,32,763 ఓటర్లకు 1,77,508 మంది ఓటేశారు. 2020లో 76.26% పోలింగ్ నమోదైంది.