News April 12, 2025

పల్నాడు: నేడు ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

image

పల్నాడు జిల్లాలో 31,672 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 18,481 మంది ఫస్టియర్‌, 13,191 మంది సెకండియర్‌ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

Similar News

News November 26, 2025

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు: SP

image

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర, పోలీసు అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, మనోభావాలు కించపరిచే పోస్టులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా ఉంచామని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. నామినేషన్ సెంటర్లలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

News November 26, 2025

భద్రాచలం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మానే రామకృష్ణ..!

image

భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మానే రామకృష్ణ భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు వివరాలు వెల్లడించారు. భద్రాచలం సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పలు పార్టీలతో స్థానికంగా పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రేపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News November 26, 2025

ఉత్తరం దిశలో తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?

image

ఉత్తరం దిశలో తలపెట్టి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఆ దిశలో ప్రవహించే అయస్కాంత తరంగాలు మెదడు శక్తిని తగ్గిస్తాయని అంటున్నారు. ‘ఇలా పడుకుంటే రక్త ప్రసరణలో ఒడిదొడుకులు కలుగుతాయి. దీనివల్ల నిద్రలేమి, పీడకలలు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. శాస్త్రానుసారం.. మెదడుపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ఈ దిశను నివారించడం ఉత్తమం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>