News April 12, 2025

పల్నాడు: నేడు ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

image

పల్నాడు జిల్లాలో 31,672 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 18,481 మంది ఫస్టియర్‌, 13,191 మంది సెకండియర్‌ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

Similar News

News December 22, 2025

గంగాధర: సర్పంచ్ మొదటి తీర్మానం.. రూపాయికే అంత్యక్రియలు!

image

బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కరీంనగర్(D) గంగాధర(M) బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే కేవలం ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా తొలి పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ వినూత్న పథకం బూరుగుపల్లి జిల్లాలోనే ప్రత్యేకంగా నిలిచింది. పరిమిత వనరులున్నా పేదలకు అండగా నిలవాలనే సర్పంచ్ సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

News December 22, 2025

వైసీపీని పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తా: పవన్

image

AP: YCP నాయకులు బెదిరించడం మానుకోవాలని Dy.CM పవన్ హెచ్చరించారు. లేదంటే పర్మినెంట్‌గా అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తెలుసన్నారు. మంగళగిరిలో నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నాకు ఎవరూ శత్రువులు కాదు. వారి విధానాలతోనే సమస్య. ఆకురౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించను. విధానాలపై ప్రశ్నిస్తే స్వాగతిస్తా. తప్పదనుకుంటే ఆఖరి అస్త్రంగానే షర్ట్ మడతపెడతాం’ అని చెప్పారు.

News December 22, 2025

శత వసంతాల చర్చి.. మన తెనాలి టౌన్ చర్చి

image

తెనాలి బోస్ రోడ్డులోని చారిత్రక క్రైస్ట్ లూథరన్ చర్చి 100ఏళ్ల మైలురాయిని అధిగమించింది. 1925లో ప్రారంభమైన ఈ చర్చికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. అప్పట్లో సింగపూర్ నుంచి ప్రత్యేక శిలలను, అత్యంత నాణ్యమైన టేకు కలపను తెప్పించి దీనిని అపురూపంగా నిర్మించారు. ఇక్కడ కొలువైన సంస్కర్త మార్టిన్ లూథర్ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇటీవలే ఈ చర్చి శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.