News April 12, 2025
పల్నాడు: నేడు ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

పల్నాడు జిల్లాలో 31,672 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 18,481 మంది ఫస్టియర్, 13,191 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News April 14, 2026
జిల్లాలో శతశాతం స్వీయ గణన నమోదు కావాలి: మన్యం కలెక్టర్

పార్వతిపురం మన్యం జిల్లాలో శతశాతం స్వీయ గణన నమోదు అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16 నుంచి 30 వరకు se.census.gov.in అధికారిక వెబ్సైట్లో స్వీయ నమోదుకు అవకాశం ఉందని, కుటుంబంలో ఒకరు మొబైల్ నంబర్ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలన్నారు.
News April 14, 2026
జిల్లాలో శతశాతం స్వీయ గణన నమోదు కావాలి: మన్యం కలెక్టర్

పార్వతిపురం మన్యం జిల్లాలో శతశాతం స్వీయ గణన నమోదు అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16 నుంచి 30 వరకు se.census.gov.in అధికారిక వెబ్సైట్లో స్వీయ నమోదుకు అవకాశం ఉందని, కుటుంబంలో ఒకరు మొబైల్ నంబర్ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలన్నారు.
News April 14, 2026
హోటల్ బిల్లులు చెల్లించలేక పాక్ అభాసుపాలు

US-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్ అందుకు వేదికైన హోటల్కు బిల్లులు చెల్లించలేక అభాసుపాలైంది. ఈనెల 10-12 తేదీల్లో ఇస్లామాబాద్లోని సెరీనా హోటల్లో 2దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే ఆ బిల్లులు ప్రభుత్వం కట్టకపోవడంతో చివరకు ఆ హోటల్ యజమానే దాన్ని భరించాల్సి వచ్చింది. ఈ హోటల్లో ప్రెసిడెంట్ సూట్ ధర ఒక రాత్రికి ₹2.21లక్షలు కాగా స్టాండర్డ్ రూమ్స్ ₹14,896/నైట్ ఉన్నట్లు సమాచారం.


