News March 31, 2025

పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

Similar News

News January 4, 2026

MNCL: వాకింగ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

image

వాకింగ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. గద్దెరాగడికి చెందిన నాగేందర్ శర్మ శనివారం సాయంత్రం ఏసీసీ వైపు వాకింగ్‌కు వెళ్తుండగా లడ్డా రైస్ మిల్లు వద్ద ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మజ్హరుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 4, 2026

విశాఖ: జలాంతర్గామిని సందర్శించిన తెలంగాణ గవర్నర్

image

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. నౌకా దళంలో కీలకంగా ఉన్న INS హిమగిరితోపాటు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని పరిశీలించారు. దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా సాధిస్తున్న పురోగతికి ఈ నౌకలు ప్రతీకలని గవర్నర్ ప్రశంసించారు.

News January 4, 2026

నిజామాబాద్: 102 కేసులు నమోదు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. రూ.9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.