News March 31, 2025
పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
Similar News
News January 5, 2026
మహ్మద్ సిరాజ్ అన్లక్కీ: డివిలియర్స్

మహ్మద్ సిరాజ్ కెరీర్పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్లక్కీ. T20 వరల్డ్ కప్కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్పైనే ఫోకస్ చేశారు. సీమర్స్పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు.
News January 5, 2026
సంగారెడ్డి: ‘వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయండి’

సంగారెడ్డి జిల్లా వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్, కాంటింజెంట్ వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై పనిభారం విపరీతంగా పెరుగుతోందని, దీంతో రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News January 5, 2026
ఆపరేషన్ స్మైల్ను విజయవంతం చేయాలి: ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలో బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో కాకుండా బయట ఇతర పనుల్లో ఉంటే ఆపరేషన్ స్మైల్ ద్వారా యాజమానులపై కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్, లేబర్, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఆపరేషన్ స్మైల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.


