News March 31, 2025
పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.


