News March 31, 2025
పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
Similar News
News February 26, 2026
MBNR: రాజకీయాలను కుదిపేస్తున్న కుమ్మెర ఘటన

కుమ్మెరలో మల్లన్న జాతర సందర్భంగా తలెత్తిన వివాదం రెండు కులాల మధ్య పంచాయితీగా మారింది. తన రెండు నెలల కుమార్తెను రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కాలితో తన్నడంతో చనిపోయిందని రజక కులానికి చెందిన చిలికేశ్వరం గణేశ్, మౌనిక దంపతులు ఆరోపిస్తున్నారు. రజక కులానికి చెందిన కుటుంబంపై రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిలో 2 నెలల పసికందు చనిపోయిందనే వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.
News February 26, 2026
సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే శరీరం పీహెచ్ దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
News February 26, 2026
నిర్మల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు సర్వం సిద్ధం

జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DIEO) పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,473 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వారి కోసం 23 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


