News March 31, 2025

పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

Similar News

News October 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 30, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 30, 2025

తాజా సినిమా ముచ్చట్లు

image

✦’అరుంధతి’ సినిమా హిందీలోకి రీమేక్? ప్రధాన పాత్రలో శ్రీలీల నటించనున్నట్లు టాక్
✦ నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్యూడ్’ సినిమా స్ట్రీమింగ్?
✦ తెలుగు డైరెక్టర్ పరశురామ్‌తో సూర్య సినిమా చేసే అవకాశం?
✦ ‘రిపబ్లిక్’ సినిమాకు సీక్వెల్.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది: సాయి దుర్గ తేజ్
✦ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా

News October 30, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.