News March 31, 2025

పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

Similar News

News November 13, 2025

నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల కోసం అవసరమైన మీసేవ ధ్రువపత్రాలు పొందడానికి ఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో నోటరైజ్డ్ అఫిడవిట్ అడగడం వల్ల పేద ప్రజలకు అదనపు ధన వ్యయం, సమయ నష్టం జరుగుతున్నదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి అఫిడవిట్‌లు లేదా గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

News November 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 13, 2025

అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు రంపచోడవరం విద్యార్థి

image

రంపచోడవరం డిగ్రీ కళాశాల విద్యార్థులు నన్నయ యూనివర్శిటీ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు గెలుపొందినట్లు ప్రిన్సిపల్ డాకే వసుధ తెలిపారు. బెంగళూరులో నిర్వహించే అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు జి. ప్రవీణ్ సెలెక్టైనట్లు వివరించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, పీడీ ప్రభాకర్ రావు, అధ్యాపకులు అభినందించారు.