News March 31, 2025

పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

Similar News

News April 18, 2025

నారాయణపేట: GREAT.. ఫ్రెండ్స్ అంటే వీళ్లే..!

image

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన వడ్ల బాలరాజు గత నెలలో మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో బాలరాజు మిత్ర బృందం వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి రూ.1.50లక్షలు జమ చేసి బాలరాజు భార్యకు గురువారం రాత్రి అందించారు. ఫ్రెండ్స్ అంతా కలిసి స్నేహితుడి కుటుంబానికి చేయూతనివ్వడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.ఆపద సమయంలో అండగా ఉన్నవారే నిజమైన దోస్తులని అన్నారు.

News April 18, 2025

ADB: విద్యార్థులు SPORTS ట్రైనింగ్‌కి సిద్ధం కండి

image

సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్‌లో వేసవి శిక్షణ శిబిరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 18, 2025

మామునూర్: వ్యక్తి సూసైడ్

image

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మామునూర్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గుంటూరుపల్లికి చెందిన పెనుముచ్చు శ్రీనివాస్ (45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అతడి భార్య శ్వేత చూసి ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వగా.. అప్పటికే చనిపోయాడు. శ్రీనివాస్ తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!