News April 12, 2025

పల్నాడు: ఫస్ట్ ఇయర్‌లో 65%, సెకండ్ ఇయర్‌లో 82 శాతం 

image

పల్నాడు జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12,622 మంది హాజరు కాగా 10,301 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. 16,121 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా వారిలో 10,495 మంది ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా అధికారి నీలావతి దేవి వివరించారు. 

Similar News

News October 21, 2025

తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.

News October 21, 2025

జగిత్యాల: పోలీసుల సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

image

శాంతియుత సమాజ నిర్మాణమే లక్ష్యంగా సమాజానికి పోలీసులు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా సందర్భంగా జగిత్యాలలో మంగళవారం ఆయన ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులున్నారు.

News October 21, 2025

సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు శిక్షణ: డీఈఓ

image

జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్లలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ పైన శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సూచించిన కేంద్రాలలో శిక్షణకు ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలని సూచించారు.