News April 12, 2025

పల్నాడు: ఫస్ట్ ఇయర్‌లో 65%, సెకండ్ ఇయర్‌లో 82 శాతం 

image

పల్నాడు జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12,622 మంది హాజరు కాగా 10,301 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. 16,121 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా వారిలో 10,495 మంది ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా అధికారి నీలావతి దేవి వివరించారు. 

Similar News

News November 24, 2025

బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

image

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

News November 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.

News November 24, 2025

VKB: జిల్లా రాజకీయాల్లో యువ గర్జన.. పాత లీడర్లకు సవాల్!

image

వికారాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల హీట్ మొదలైంది. ఈసారి పంచాయతీల్లో యువత పెద్ద ఎత్తున రంగంలోకి రావడంతో రాజకీయ వాతావరణం మారిపోయింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలు చేస్తూ, గ్రామ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పాత నేతలకు యువత నేరుగా సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికల్లో “యువ శక్తి vs పాత నేతలు” పోటీ హాట్‌గా మారనుంది. యువ శక్తే ఈసారి గేమ్‌చేంజర్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది.