News March 28, 2025
పల్నాడు: ఫ్యాప్టో ఛైర్మన్గా రామిరెడ్డి ఎన్నిక

పల్నాడు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్గా ఎల్వీ రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా సేవలందించడం జరుగుతుందని రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్యా బోధనతో పాటు, ఉపాధ్యాయుల సంక్షేమం కొనసాగే విధంగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగిస్తానని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News November 28, 2025
కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.
News November 28, 2025
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో రూ.4.35 కోట్లు వసూలు చేసింది. అటు ఓవర్సీస్లోనూ ఫస్ట్ డే 2,75,000 డాలర్స్ కలెక్ట్ చేసింది. రేపటి నుంచి వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.
News November 28, 2025
రబీకి సాగునీటి సమస్యలు రాకుండా చూడాలి: కలెక్టర్

రబీ సీజన్లో వరి సాగుకు ఎటువంటి సాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఇటీవల జరిగిన ఇరిగేషన్ సలహా మండలి సమావేశం అంశాలపై శుక్రవారం ఆయన సమీక్షించారు. చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.


