News March 28, 2025

పల్నాడు: ఫ్యాప్టో ఛైర్మన్‌గా రామిరెడ్డి ఎన్నిక

image

పల్నాడు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌గా ఎల్వీ రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా సేవలందించడం జరుగుతుందని రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్యా బోధనతో పాటు, ఉపాధ్యాయుల సంక్షేమం కొనసాగే విధంగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగిస్తానని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News December 10, 2025

తిరుపతి: ఐదుగురి స్టేట్మెంట్ రికార్డు

image

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా పోలీసులు ఐదుగురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వర్సిటీకి సంబంధించి నలుగురు కాగా.. ఒడిశాలో యువతి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా వెళ్లిన సీఐ బుధవారం తెల్లవారుజామున తిరుపతికి రానున్నారు. ఆ తర్వాత పక్కా ఆధారాలతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.

News December 10, 2025

నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

News December 10, 2025

బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

image

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.