News July 13, 2024
పల్నాడు, బాపట్ల ఎస్పీలు బదిలీ

పల్నాడు, బాపట్ల జిల్లా ఎస్పీలు మలికా గర్గ్, వకుల్ జిందాల్ను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, విజయనగరం APSP బెటాలియన్ కమాండెంట్గా మలికాను నియమించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు అప్పుడు పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్ వచ్చారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పాటైనప్పటి నుంచి వకుల్ జిందాల్ అక్కడ ఎస్పీగా పని చేస్తున్నారు.
Similar News
News November 19, 2025
గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.
News November 19, 2025
గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.
News November 19, 2025
Way2News కథనానికి నాగార్జున వర్సిటీ స్పందన

<<18322201>>మాస్టారూ.. ఇదేం క్వశ్చన్ పేపర్?<<>> అంటూ Way2Newsలో మంగళవారం వచ్చిన వార్తకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల సమన్వయకర్త స్పందించారు. బీఈడి, ఎంఈడీ, ఎల్బీబీ, పీజీ సైన్స్, ఆర్ట్స్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటం వల్ల పొరపాటున Msc 3rd సెమిస్టర్ ప్రశ్నాపత్రం రాతపూర్వకంగా వచ్చిందని తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


