News July 13, 2024

పల్నాడు, బాపట్ల ఎస్పీలు బదిలీ

image

పల్నాడు, బాపట్ల జిల్లా ఎస్పీలు మలికా గర్గ్, వకుల్ జిందాల్‌ను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్‌, విజయనగరం APSP బెటాలియన్‌ కమాండెంట్‌గా మలికాను నియమించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు అప్పుడు పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్ వచ్చారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పాటైనప్పటి నుంచి వకుల్ జిందాల్ అక్కడ ఎస్పీగా పని చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

GNT: మృతిచెందిన వృద్ధురాలు మీకు తెలుసా.?

image

గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్ధురాలు పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News December 26, 2025

GNT: సినీ జగత్తులో శాశ్వత వెలుగు.. మహానటి సావిత్రి

image

తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన మహానటి సావిత్రి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 1935లో గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన ఆమె, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగి, సావిత్రి అంటేనే అభినయం అనే స్థాయికి చేరారు. మాయాబజార్‌లో శశిరేఖ పాత్రతో అమరత్వం పొందిన ఆమె, భావోద్వేగాలకు ప్రాణం పోసిన నటిగా సినీ చరిత్రలో నిలిచారు. @నేడు ఆమె వర్ధంతి.

News December 25, 2025

అమరావతి రైల్వే లైన్.. మరో 300 ఎకరాల సేకరణ

image

ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకమని అధికారులు అంటున్నారు.