News March 14, 2025

పల్నాడు: మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దు: ఎస్పీ

image

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ సందర్భంగా సాంప్రదాయ రంగులు ఉపయోగించటం ఆరోగ్యకరమని అన్నారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని వివరించారు. ప్రధాన కుడళ్లు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉంచడంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News December 5, 2025

ఎన్నికల నియమావళి అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి పనిని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

image

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.

News December 5, 2025

అన్నమయ్య: 8 మంది స్మగ్లర్లు అరెస్ట్

image

సానిపాయ అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి 12 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ కడప సబ్ కంట్రోల్ RSI నరేష్, స్థానిక FBO అంజనా స్వాతి తెలిపారు. శుక్రవారం రాయవరం సెక్షన్ చిన్నముచ్చురాళ్ల గుట్ట వద్ద తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాకు చెందిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశామన్నారు.