News March 2, 2025
పల్నాడు: యువకుడితో పరారైన వివాహిత

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన TGలోని మేడ్చల్లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడు(D) బొల్లాపల్లి(M)కి చెందిన గోపి(22)కి వరంగల్కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్పై వెళ్తుండగా భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరూ పరారయ్యారు. దీంతో భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 2, 2025
లేజర్ వెపన్ ‘ఐరన్ బీమ్’ సిద్ధం చేసిన ఇజ్రాయెల్!

అత్యాధునిక, హైపవర్ లేజర్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ‘ఐరన్ బీమ్’ను డిసెంబర్ 30న దళాలకు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలు, క్షిపణులు, రాకెట్లు, UAVs, డ్రోన్లను భూమిపై నుంచే ఛేదించేలా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 2014లోనే ఐరన్ బీమ్ను ఇజ్రాయెల్ ఆవిష్కరించింది. కానీ 11 ఏళ్లుగా అభివృద్ధి దశలోనే ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి సైన్యానికి అందించనుంది.
News December 2, 2025
భద్రాద్రి: సీఎం రాక.. సమస్యలపై స్పందిస్తారో చూడాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. నిధుల కొరతతో నిలిచిన సీతారామ ప్రాజెక్టు పనులు, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సత్తుపల్లి ఫుడ్పార్క్ సమస్యలపై సీఎం కీలక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. నేటి పర్యటనలో ఆయన జిల్లాకు ముఖ్య నిర్ణయాలు ప్రకటిస్తారో లేదో అని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News December 2, 2025
ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.


