News March 31, 2025

పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు. 

Similar News

News December 8, 2025

GNT: అత్యవసర సమయంలో సంజీవిని LOC..!

image

పేదలకు వైద్య సహాయం కోసం CMRF, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలు ఉపయోగపడుతుంటాయని తెలిసిందే. ఇవి కాక అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) అనే పథకం సంజీవినిలా పని చేస్తుందని చాలా మందికి తెలీదు. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్, నవజాత శిశువుల అనారోగ్యం వంటి వాటికి అత్యవసర చికిత్స కోసం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే బాధితులకు ఈ సాయం అందుతుంది.

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 8, 2025

పెద్దపల్లి: ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్..!

image

పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాలలో ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప సర్పంచ్ ఆశావహులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో మద్దతు తెలపాలని ఒక్కో వార్డు సభ్యుడికి రూ.50,000 నుంచి రూ.1,00,000 ముట్టినట్లు గ్రామాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఈనెల 14న పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.