News March 31, 2025
పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు.
Similar News
News November 22, 2025
BOIలో 115 SO పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్సైట్: https://bankofindia.bank.in/
News November 22, 2025
కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్లో బైక్తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
News November 22, 2025
MBNR: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు..!

వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసే గ్రామాలకు రూ.10 లక్షల ప్రొత్సాహకం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. మహబూబ్నగర్ 441, నాగర్కర్నూల్ 461, నారాయణపేట 280, వనపర్తి 268, గద్వాల్ 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.


