News March 14, 2025

పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.

Similar News

News December 10, 2025

సాగర్ కేవలం ప్రాజెక్టు కాదు.. ఒక ఎమోషన్

image

సాగర్ ఆనకట్ట కేవలం రాళ్లు, సిమెంటుతో కట్టిన కట్టడం కాదు. ఇది లక్షలాది మంది శ్రమజీవుల కష్టం. కరవు కోరల్లో చిక్కుకున్న తెలుగు నేలకు ఊపిరి పోసిన ఈ ప్రాజెక్టును భారత తొలి ప్రధాని నెహ్రూ ‘ఆధునిక దేవాలయం’గా అభివర్ణించారు. ఆధునిక యంత్రాలు లేని ఆ రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు శ్రమించి ఈ మహానిర్మాణం పూర్తి చేశారు. ఎన్ని పండగలున్నా సాగర్ నిండితేనే ఉమ్మడి NLG రైతులకు పద్ద పండుగ.

News December 10, 2025

రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్‌ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.

News December 10, 2025

మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా: ట్రంప్

image

అధ్యక్షుడిగా తన తొలి టర్మ్‌లో US ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే బలమైనదిగా నిలిపానని ట్రంప్ అన్నారు. ఈసారి మరింత పెద్దగా, గతంలో ఎన్నడూ చూడని దృఢమైన వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడకపోతే దేశ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి రాకముందు కొత్త ఉద్యోగాలన్నీ వలసదారులకు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.