News March 14, 2025

పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.

Similar News

News December 2, 2025

శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైరీ ఫుడ్ అంటూ!

image

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్‌పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.

News December 2, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* పిజ్జా చల్లబడి, గట్టిపడితే ఒక గిన్నెలో పిజ్జా ముక్కలు పెట్టి.. మరో గిన్నెలో వేడి నీళ్లు పోసి, అందులో పిజ్జాముక్కల గిన్నెను 5 నిమిషాలు ఉంచితే చాలు.
* ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లు మండుతుంటే ఒక టిష్యూ పేపర్‌ను తడిపి, దానిపై ఉల్లిగడ్డను కట్ చేస్తే కళ్లు మండవు.
* గిన్నెలు మాడిపోయినప్పుడు ఓ గ్లాస్ పెప్సీని మాడిపోయిన గిన్నెలో పోసి వేడి చేసి, 10 నిమిషాల తర్వాత కడిగితే గిన్నెలు మెరిసిపోతాయి.

News December 2, 2025

భువనగిరి: ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచులు..!

image

బొమ్మలరామారం(M) చీకటిమామిడికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబీకులు 4 పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చంద్రమౌళి తొలిసారిగా 1995లో తర్వాత 2001లో కాగా 2007లో ఆయన తల్లి విజయం సాధించారు. 2013లో ఆయన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ MPTCగా గెలుపొందగా 2019లో శ్రీనివాస్ సతీమణి వసంత సర్పంచ్‌గా గెలిచారు. దాదాపు 30ఏళ్లపాటు తమ కుటుంబం గ్రామానికి సేవలందించిందని, ప్రస్తుతం ఇతరులకు అవకాశం ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు.