News March 14, 2025
పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.
Similar News
News November 21, 2025
APPLY NOW: CLRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI)14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 22లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech, M.Tech, ఎంఫార్మసీ, MVSc, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. DEC 22న రాత పరీక్ష, 23న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: https://www.clri.org/
News November 21, 2025
Rh నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏం చేయాలంటే?

తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ అయితే ప్రెగ్నెన్సీలో కచ్చితంగా ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ICT) 3,7 నెలల్లో చేయించుకోవాలి. ఐసీటీ నెగెటివ్ వస్తే ఏడో నెలలో, డెలివరీ అయిన 72 గంటల్లో తల్లికి ‘యాంటీ డీ’ ఇంజెక్షన్ డోసులు ఇస్తారు. రెండోసారి గర్భం దాల్చిన వారిలోనే దీని సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించాలి. సమస్య తీవ్రతను బట్టి బిడ్డకు చికిత్స చేస్తారు.
News November 21, 2025
తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.


