News March 2, 2025
పల్నాడు: రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాలోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
Similar News
News November 3, 2025
13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 3, 2025
పెద్దపల్లి: ‘కనీస విద్యా ప్రమాణాలు 90% మంది విద్యార్థులకు అందించాలి’

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 90% మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ముగిసేలోపు కనీస విద్యా ప్రమాణాలను చేరుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సోమవారం హెడ్మాస్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో చదవడం, రాయడం, లెక్కల నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలు నెలవారీ లక్ష్యాలతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
News November 3, 2025
నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.


