News March 2, 2025

పల్నాడు: రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాలోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

Similar News

News March 24, 2025

ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చి దిద్దాలి: లోకేశ్

image

ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం మంత్రి లోకేశ్ సమక్షంలో GNU, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్నారు.

News March 24, 2025

కర్నూలు జిల్లాలో TODAY TOP NWS 

image

➤ డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్
➤ కర్నూలులో టీడీపీ నేత హత్య.. నిందితుడి భార్య అరెస్ట్
➤ ఆదోని పరిధిలో 20అడుగుల అతిపెద్ద పాము
➤ కోడుమూరులో దారుణం.. విద్యార్థిని చితకబాదిన సీనియర్
➤ కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను
➤ పెద్దకడబూరు: కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
➤ కోడుమూరు ఘటన.. వార్డెన్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్
➤ క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: జేసి

News March 24, 2025

NZB: యథావిధిగా పాఠశాలలు

image

ఈ నెల 25న అన్ని పాఠశాలలు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని డీఈఓ అశోక్ తెలిపారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుండగా 25న ఎస్ఎస్సీ పరీక్ష లేకపోవడంతో ఈ సవరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తిస్తున్న వారు యథావిధిగా తమ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.

error: Content is protected !!