News February 20, 2025

పల్నాడు: రైల్వేట్రాక్‌ పై మృతదేహం కలకలం

image

బెల్లంకొండ – రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తుతెలియని మృతదేహం గుర్తించారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు క్రిందపడి బలమైన గాయాలు కలిగి అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. వయస్సు సుమారుగా 30 నుంచి 35 సంవత్సరములు కలిగి ఉంటుందన్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు చొక్కా సిమెంట్ రంగు ప్యాంట్ ధరించాడన్నారు.ఆర్పీఎఫ్ పోలీసులు చేరుకొని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News December 5, 2025

FLASH: ఏసీబీకి చిక్కిన HNK అడిషనల్ కలెక్టర్

image

హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన రూ.60,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి ఈ లంచం తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

News December 5, 2025

డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

image

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.

News December 5, 2025

నిర్మల్: ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

కలెక్టరేట్‌లో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ మండలాల వారిగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బందిని నియమించామన్నారు.