News February 20, 2025
పల్నాడు: రైల్వేట్రాక్ పై మృతదేహం కలకలం

బెల్లంకొండ – రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తుతెలియని మృతదేహం గుర్తించారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు క్రిందపడి బలమైన గాయాలు కలిగి అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. వయస్సు సుమారుగా 30 నుంచి 35 సంవత్సరములు కలిగి ఉంటుందన్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు చొక్కా సిమెంట్ రంగు ప్యాంట్ ధరించాడన్నారు.ఆర్పీఎఫ్ పోలీసులు చేరుకొని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News November 17, 2025
నిజామాబాద్ అమ్మాయికి ‘బాలరత్న-2025’ అవార్డు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభశ్రీ ‘మల్టిపుల్ టాలెంట్ గర్ల్’, ‘బాలరత్న – 2025’ అవార్డులను అందుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విభ శ్రీ.. శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ పాటలు, పలు టీవీ షోలు, చలనచిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సినీనటి ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా ఈ బాలకళాకారిణి అవార్డును స్వీకరించింది.
News November 17, 2025
కర్నూలు: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News November 17, 2025
చలి తీవ్రత.. 10 జిల్లాలకు అలర్ట్!

TG: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్(D) సిర్పూర్లో 7.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ADB, వికారాబాద్, MDK, నిర్మల్, BPL, మంచిర్యాల, WGL, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో టెంపరేచర్లు 7-11 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పింది.


