News March 24, 2025
పల్నాడు: లెక్కల పరీక్షకు 25, 212 మంది విద్యార్థుల హాజరు

పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 128 సెంటర్లలో 25,212 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. 99.06శాతం ఉన్నట్లు తెలిపారు. 128 పరీక్షా కేంద్రాలను పరిశీలించేందుకు 22 సిట్టింగ్ స్క్వాడ్లు, 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వినుకొండ, నూజెండ్ల పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు.
Similar News
News November 17, 2025
ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.
News November 17, 2025
ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.
News November 17, 2025
మలికిపురం: ఇద్దరు పిల్లలతో సహా వ్యక్తి అదృశ్యం

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్ ఇద్దరు పిల్లలతో సహా సోమవారం అదృశ్యమయ్యాడు. ఇద్దరు పిల్లలను ఆధార్ కార్డుల కోసం మధ్యాహ్నం ఇంటి నుంచి తీసుకువచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దిండి చించినాడ వారధిపై బైకు, జోళ్లు విడిచి పిల్లలతో సహా అదృశ్యమయ్యాడు. పిల్లలతో సహా నదిలో దూకాడా లేక ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్లాడా అన్నది మిస్టరీగా మారింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


