News April 3, 2025
పల్నాడు: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో 2025 ఏప్రిల్ 5న జరగనున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదాపడ్డాయి. 5వ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ హాలిడే ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 15న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News November 20, 2025
AP న్యూస్ రౌండప్

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
News November 20, 2025
హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జేసీ

జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వసతి గృహాల అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని జేసీ టి.నిశాంతి సూచించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పాఠశాలలకు మంజూరు చేయబడిన 1,000 బకెట్లు, 1,000 దుప్పట్లను ఆమె అధికారులకు అందజేశారు. విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో సౌకర్యవంతమైన వసతులు కల్పించాలని జేసీ సూచించారు.
News November 20, 2025
నంగునూరు: ట్యాబ్ ఎంట్రీలో జాప్యం ఉండొద్దు: కలెక్టర్

నంగునూరు మండలంలోని నర్మెట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ధాన్యంపై టార్ఫాలిన్ కవర్లు కప్పి పెట్టాలని రైతులకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలో జాప్యం కాకుండా చూసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.


