News March 25, 2025
పల్నాడు: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
Similar News
News November 27, 2025
RR: ధ్రువపత్రాల కోసం మీ సేవకు పరుగులు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రాల కోసం మీసేవ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో వారితో మీసేవ సెంటర్లు కిక్కిరిసి పోయాయి. రెండో విడతలో నిర్వహించే ఎన్నికల కోసం ముందస్తుగా పత్రాలు సమకూర్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల పుణ్యమా అంటూ తమకు అదనపు గిరాకీ వస్తుందని ఆమనగల్ సహా పలు సెంటర్లలోని నిర్వాహకులు చెబుతున్నారు.
News November 27, 2025
గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 27, 2025
ములుగు: ఎన్నికల సమాచారం కోసం టీ-పోల్ యాప్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సమాచారాన్ని అందించేందుకు టీ-పోల్ మొబైల్ యాప్ అందుబాటులో ఉందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు, నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించాలని కోరారు. జిల్లాలోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.


