News March 25, 2025
పల్నాడు: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
Similar News
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.
News November 17, 2025
హన్మకొండ: పైసా దేదో.. కామ్ ఖరో..!

హన్మకొండలో ఓ అధికారి లంచాల బాగోతం ముదిరిపోయింది. వివాదాస్పద స్థలాల కేసుల్లో అధికార నేతలతో కలిసి డబ్బులిస్తే చాలు వారికి అనుకూలంగా ఆర్డర్లను ఇస్తున్నారనేది బహిరంగంగా అందరికీ తెలిసింది. ఇటీవల HNK(M) సుబ్బయ్యపల్లి శివారులో సైతం 20ఎకరాల స్థలానికి సంబంధించిన కేసులో అనుకూలంగా ఆర్డర్ కోసం రూ.50లక్షల వరకు చేతులు మారినట్లు సమాచారం. దీంతో అవినీతి నిరోధక శాఖ మాత్రం చోద్యం చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News November 17, 2025
‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు కొత్త జీవితం

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు పశువైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్లో గౌరి అనే ఆవు కాలు కోల్పోయింది. దీంతో దానికి దేశీయంగా తయారు చేసిన ‘కృష్ణ లింబ్’ అనే కృత్రిమ కాలుని అమర్చారు. దీంతో అది మునుపటిలా నడుస్తోంది. డాక్టర్ తపేశ్ మాథుర్ దీన్ని రూపొందించారు. అవసరమైన జంతువుల యజమానులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.


