News March 27, 2025

పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 20, 2025

సంగారెడ్డి: రూమ్‌లో లవర్స్.. నాన్న ఎంట్రీతో విషాదం!

image

8వ అంతస్తు నుంచి జారిపడి యువతి మృతిచెందిన ఘటన SRDజిల్లా రామచంద్రపురం మం.లో జరిగింది. వివరాలు.. HYDకు చెందిన యువతి(20) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొల్లూర్ 2BHKలో ఉన్న ఇంటికి యువతి ఆ యువకుడితో వచ్చింది. ఆ సమయంలో తండ్రి ఇంటికి రావడంతో భయపడిన ఆమె బాల్కనీ గుండా పక్క ఫ్లాట్‌కు వెళ్లే ప్రయత్నంలో జారిపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 20, 2025

రానున్న ఐదు రోజులు చలి ముప్పు

image

కర్నూలు, నంద్యాల జిల్లాలను చలి వణికిస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. ఈ నెల 24 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16°C నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 20, 2025

బిగ్‌బాస్ విజేత ఎవరు?

image

బిగ్‌బాస్-9 విజేత ఎవరో రేపు తేలిపోనుంది. ఇవాళ్టి నుంచి టాప్-5 కంటెస్టెంట్లు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, డెమాన్, సంజనలో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరికి టాప్-2లో నిలిచే ఇద్దరిలో విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తవగా కళ్యాణ్ టాప్ ప్లేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు తొలిసారి ఫీమేల్ విజేతగా తనూజ నిలవనున్నారని ప్రచారం జరుగుతోంది. విన్నర్ ఎవరవుతారో మీరూ గెస్ చేయండి.