News March 27, 2025

పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 21, 2025

సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు శిక్షణ: డీఈఓ

image

జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్లలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ పైన శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సూచించిన కేంద్రాలలో శిక్షణకు ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలని సూచించారు.

News October 21, 2025

కలియతిరిగిన జగిత్యాల జిల్లా కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సింగారావుపేట గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు. రద్దయిన ప్రతిపాదనల స్థానంలో కొత్త ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరామనగర్లో జీపీ భవన నిర్మాణం, ఇటిక్యాల గ్రామంలో అంగన్వాడీ భవనం, హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో మండలాధికారులు పాల్గొన్నారు.

News October 21, 2025

సంగారెడ్డి: రేపు మంత్రి దామోదర్ పర్యటన

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం జిల్లాలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం తెలిపింది. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో పీఎస్ఆర్ గార్డెన్‌లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపుని ప్రారంభిస్తారని చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు జోగిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో వడ్ల కొనుగోలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.