News March 27, 2025

పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 8, 2026

పోచంపల్లి అమ్మాయికి అరుదైన ఘనత

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆమె ముందు నృత్య ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం పోచంపల్లికి చెందిన బడుగు నికితకు లభించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన రిహార్సల్స్‌లో నికిత ప్రతిభను చూసి ఢిల్లీ అధికారులు ప్రశంసించారని ఆమె తండ్రి శివశంకర్ ఆనందం వ్యక్తం చేశారు. నికిత ఈ ఘనత సాధించడంపై పోచంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 8, 2026

ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం.. జేసీ పిలుపు

image

జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ సిబ్బందికి ఆమె స్వయంగా స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో కలెక్టరేట్ సిబ్బంది ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.

News January 8, 2026

మాస శివరాత్రి ప్రత్యేక రుద్రాభిషేకం

image

మాస శివరాత్రి రోజున పరమశివుడిని ఆరాధించడం ద్వారా మీ సంకల్పం నెరవేరడానికి, సకల పాపాలు తొలగడానికి సువర్ణవకాశం లభిస్తుంది. పూర్వ కర్మ దోషాలు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగి, దుష్ట శక్తులు నుంచి శివుని కవచం రక్షణగా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శివునికి అత్యంత ప్రియమైన ఈ పవిత్ర రోజున మీ పేరు, గోత్రంతో <>వేదమందిర్<<>> ద్వారా రుద్రాభిషేకం చేయించుకుని దైవానుగ్రహాన్ని పొందండి.