News March 27, 2025
పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 16, 2025
మల్లెమడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తిరుపతి తాతయ్యగుంటకు చెందిన శేఖర్ (32), శివ (35), నరేష్ (36) ముగ్గురు రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్కు ఈతకోసం వెళ్లారు. ఉదయం 9 గంటలకు నీటిలో దిగిన శివ లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతుండగా, కాపాడేందుకు దూసుకెళ్లిన నరేష్ కూడా మునిగిపోయాడు. శేఖర్ రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
News November 16, 2025
అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు మూవీ వచ్చింది.
News November 16, 2025
జగిత్యాల: కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టు ఖాళీ

జగిత్యాల ధరూర్ క్యాంపులోనికేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ ఉమెన్ పోస్టు కోసం అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అర్బన్ మండల విద్యాధికారి చంద్రకళ తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 17 నుంచి 19 వరకు జగిత్యాల కేజీబీవీలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. సెక్యూరిటీ ఏజెన్సీలలో శిక్షణ పొందిన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు.


