News May 12, 2024

పల్నాడు: విద్యుత్‌ షాక్‌‌తో యువ రైతు మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్‌ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్‌ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News February 19, 2025

గుంటూరు: ‘కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి’ 

image

కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందిన ఘటన సంగడిగుంట లాంఛెస్టర్ రోడ్డులో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కి చెందిన కొండమ్మ (58) విధుల్లో ఉండగా ఓ యువకుడు తన కారు కింద ఉన్న కుక్కల్ని బయపెట్టడానికి ఎక్సలేటర్ ఇచ్చాడు. అప్పటికే గేరులో ఉన్న కారు పారిశుద్ధ్య కార్మికురాలిపైకి దూసుకువెళ్లడంతో ఆమె మృతిచెందినట్లు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కమిషనర్ శ్రీనివాసులు, కార్మిక సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. 

News February 19, 2025

ANU: BED పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి బీ.ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఎం.సుబ్బారావు నాగార్జున వర్సిటీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు.

News February 18, 2025

గుంటూరులో పడిపోయిన చికెన్ ధరలు

image

బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో కూడా చికెన్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు నగరంలో రూ.25 ఎక్కువగా విక్రయించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు మటన్, చేపల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో గుంటూరు చికెన్ వ్యాపార దుకాణాల సంఘ సభ్యులు కేజీ రూ. 100కి విక్రయించాలని నిర్ణయించారు. 

error: Content is protected !!