News May 12, 2024

పల్నాడు: విద్యుత్‌ షాక్‌‌తో యువ రైతు మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్‌ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్‌ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News February 7, 2025

గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి

image

కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

News February 7, 2025

పర్యాటక రంగం అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ధి: మంత్రి దుర్గేశ్

image

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేసి తమదైన ముద్రవేయాలని పర్యాటక శాఖ అధికారులకు మంత్రి కందుల దుర్గేశ్ దిశా నిర్దేశం చేశారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ 11వ ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. లోకేశ్‌కు 8వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో గుంటూరు జిల్లా మంత్రులు నాదెండ్ల మనోహర్ 4 ర్యాంకు రాగా, లోకేశ్‌కు 8వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

error: Content is protected !!