News August 28, 2024
పల్నాడు: ‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. హేలీప్యాడ్, ప్రధాన సభా స్థలాన్ని పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేలాగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 12, 2026
GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 12, 2026
ఇక ఆన్లైన్లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News April 12, 2026
ఇక ఆన్లైన్లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


