News February 21, 2025
పల్నాడు: సీఐని విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం

సీఐ శ్రీనివాసరావు తన వద్ద రూ.35 లక్షలు తీసుకొని మోసగించాడని సంతగుడిపాడుకి చెందిన రామారావు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో జీరో ఎఫ్.ఐ.ఆర్గా కేసు నమోదు చేశారు. 2021లో సీఐపై సస్పెండ్ వేటు వేశారు. స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సీఐ పై ఆరోపణలు వాస్తవమని నిరూపణ కావడంతో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 21, 2025
ముంబై డ్రగ్స్ పార్టీ.. హీరోయిన్ సోదరుడికి సమన్లు

ముంబై డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్కు యాంటీ నార్కోటిక్స్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. 20న విచారణకు గైర్హాజరైన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఒర్రీ 26న రావాలని సూచించింది. సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించినట్టు డ్రగ్స్ వ్యాపారి మొహమ్మద్ సలీమ్ మొహమ్మద్ సుహైల్ షేక్ అంగీకరించినట్టు ముంబై కోర్టుకు తెలిపింది.
News November 21, 2025
సర్వీస్ నుంచి కర్నూలు సీఐ శంకరయ్య డిస్మిస్

సీఐ జె.శంకరయ్యను పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ (తొలగింపు) చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు ఆయన తెలిపారు.
News November 21, 2025
ఆరుగురికి వారం రోజుల జైలు శిక్ష: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురు నిందితులకు వారం రోజుల జైలుశిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. పెదమానాపురం, బూర్జువలస, ఎల్.కోట పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నిందితులపై గజపతినగరం అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.విజయ రాజకుమార్, కొత్తవలస మెజిస్ట్రేట్ విజయచంద్ర శిక్షలను విధించారన్నారు.


