News February 21, 2025
పల్నాడు: సీఐని విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం

సీఐ శ్రీనివాసరావు తన వద్ద రూ.35 లక్షలు తీసుకొని మోసగించాడని సంతగుడిపాడుకి చెందిన రామారావు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో జీరో ఎఫ్.ఐ.ఆర్గా కేసు నమోదు చేశారు. 2021లో సీఐపై సస్పెండ్ వేటు వేశారు. స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సీఐ పై ఆరోపణలు వాస్తవమని నిరూపణ కావడంతో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News December 5, 2025
FLASH: ఏసీబీకి చిక్కిన HNK అడిషనల్ కలెక్టర్

హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన రూ.60,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి ఈ లంచం తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
News December 5, 2025
డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.
News December 5, 2025
నిర్మల్: ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

కలెక్టరేట్లో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ మండలాల వారిగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బందిని నియమించామన్నారు.


