News February 21, 2025
పల్నాడు: సీఐని విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం

సీఐ శ్రీనివాసరావు తన వద్ద రూ.35 లక్షలు తీసుకొని మోసగించాడని సంతగుడిపాడుకి చెందిన రామారావు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో జీరో ఎఫ్.ఐ.ఆర్గా కేసు నమోదు చేశారు. 2021లో సీఐపై సస్పెండ్ వేటు వేశారు. స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సీఐ పై ఆరోపణలు వాస్తవమని నిరూపణ కావడంతో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News March 24, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్కు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్కు ఊరట దక్కింది. అతడిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో శ్రవణ్ పోలీసుల విచారణకు సహకరించాలని పేర్కొంది. ఇదే కేసులో నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం 2 వారాల సమయం కోరింది. దీంతో విచారణను ఉన్నత న్యాయస్థానం 2 వారాలు వాయిదా వేసింది.
News March 24, 2025
పబ్లిక్ ఇష్యూకు Meesho

దేశీయ ఇ-కామర్స్ కంపెనీ Meesho పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. బిలియన్ డాలర్ల విలువైన IPO కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ బ్యాంకును లీడ్ బ్యాంకర్లుగా ఎంచుకుందని తెలిసింది. గత ఏడాది $3.9B గా ఉన్న విలువను 2.5 రెట్లకు పెంచి $10Bగా చూపాలని భావిస్తోంది. సేల్స్ పెరుగుతాయి కాబట్టి దీపావళి టైమ్లో లిస్టింగ్కు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అమెజాన్, ఫ్లిప్కార్టుకు మీషో బలమైన పోటీదారుగా అవతరించింది.
News March 24, 2025
సంచలనం.. రూ.50 కోట్ల క్లబ్లోకి ‘కోర్ట్’!

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.50.80 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసి భారీ లాభాలను పొందింది. థియేటర్ కలెక్షన్లతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్కు మరిన్ని లాభాలొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.