News February 6, 2025
పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

బుక్కరాయసముద్రంలో కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామంలో వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ నాయకుడు శ్రీరామ్ రెడ్డి, ఈవో రమేశ్ ఆధ్వర్యంలో స్వామిని పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగించారు. దేవరకొండపైకి తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News January 5, 2026
ఈ నెల 6, 7వ తేదీలలో ఇంటర్వ్యూలు

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.
News January 4, 2026
అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
News January 4, 2026
అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.


