News September 10, 2024
పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత..!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
Similar News
News January 10, 2026
విశాఖ: 12 నుంచి జిల్లా స్థాయి పోటీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలు పాండురంగపురం వద్ద సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. గాలిపటాలు ఎగురు వేయుట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, తాడు లాగుట, కర్ర సాము పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News January 10, 2026
విశాఖలో ముగిసిన ఇండియన్ లైట్హౌస్ ఫెస్టివల్ 3.0

విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ లైట్హౌస్ ఫెస్టివల్ 3.0 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రూ.230 కోట్ల విలువైన పోర్ట్ ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా, ఏపీలో మొదటి లైట్హౌస్ మ్యూజియాన్ని ప్రకటించారు. గత దశాబ్దంలో లైట్హౌస్ టూరిజం 5 రెట్లు పెరిగిందని, దేశవ్యాప్తంగా మరిన్ని లైట్హౌస్లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.
News January 10, 2026
విశాఖ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం

విశాఖ రైల్వే స్టేషన్లో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు సౌలభ్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్లు, తాగునీరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు డోర్ వద్ద నిలుచుని ప్రయాణం చేయకూడదని సూచించారు. ప్లాట్ ఫారం అవతల నుంచి రైలు ఎక్కడం వంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆర్పీఎఫ్ పోలీసులను ఆదేశించారు.


