News January 29, 2025
పల్లి రైతుల ఆందోళన కనిలించడం లేదా సీఎం గారూ: కవిత

వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారూ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క వ్యాపారుల మోసం, మరోపక్క ప్రభుత్వం శీతకన్నులో వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్నగర్ జిల్లా అట్టుడుకుతోందన్నారు.
Similar News
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
HYD: రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్

నకిలీ IPS శశికాంత్ను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు షేక్ పేటలోని అపర్ణ ఔరా అపార్ట్ మెంట్కు వెళ్లి తాళం తీసి వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్ రోబ్లో ఉన్న రోలెక్స్ వాచ్పై పడింది. వీడియోకు చిక్కకుండా వాచీని చేజిక్కించుకోగలిగినా మరో కానిస్టేబుల్ కంట పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువులు కాజేశాడు.
News November 28, 2025
హైదరాబాదీలు వీకెండ్ ప్లాన్ చేశారా?

నగరవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీకెండ్ చిల్ అయ్యేందుకు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో TGFDC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనెల 29న సా.5 నుంచి 30న ఉ.10 గంటల వరకు నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఇందులో టెంట్ పిచింగ్, టీమ్ బిల్డింగ్, నైట్ క్యాంపింగ్ ఫారెస్ట్ వాక్ వంటివి ఉంటాయి. ఇందులో అరుదైన పక్షిజాతులను చూడొచ్చు. ఆసక్తిగలవారు 73823 07476, 94935 49399లో సంప్రదించండి.


