News February 21, 2025

పల్లె పండుగ పనులు శత శాతం పూర్తికావాలి: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో పల్లె పండుగ కింద మంజూరైన పనులన్ని శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె పండుగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్నారు.

Similar News

News October 24, 2025

కేయూ పరిశోధకురాలు చైతన్య కుమారికి డాక్టరేట్

image

కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ పరిశోధకురాలు కె.చైతన్య కుమారి డాక్టరేట్ పొందారు. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ప్రకటించారు. ఆచార్య వల్లూరి రామచంద్రం మార్గదర్శకత్వంలో ఆమె “Public Policy and Tribal Welfare: A Study of ITDA Programs in Kumram Bheem Asifabad District” అంశంపై పరిశోధన పూర్తి చేశారు. మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఆమెను అధ్యాపకులు అభినందించారు.

News October 24, 2025

భామిని: ‘వార్డెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం’

image

భామిని మండలంలోని ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలో అతిధి హస్టల్ వార్డెన్(పురుషుడు)పోస్టుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ గంగాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసిన అనుభవం, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డీగ్రీ ఉండాలన్నారు. ముఖాముఖి కోసం ఈనెల 28న ఉదయం 9 గంటలకు పాఠశాలకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు94909 24540 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 24, 2025

రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌

image

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని నల్గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చరించారు. శుక్ర‌వారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.