News April 7, 2025
పల్వంచ: తాళం వేసిన ఇంట్లో దొంగతనం

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సాయిలు శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి వెళ్లరు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారం పుస్తెల తాడు, రూ.20,000 నగదును దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన భువనగిరి రాజు ఇంటిలో కూడా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్ఐ అనిల్ ఆదివారం చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
పరిషత్ పోరుకు ‘ఓడిన’ అభ్యర్థులు ‘సై’..!

గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడే పరిషత్ సెగ మొదలైంది. పంచాయతీ పోరులో చేదు అనుభవం ఎదురైన అభ్యర్థులు ఇప్పుడు MPTC, ZPTC స్థానాలపై కన్నేశారు. త్వరలోనే ఈ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లాలోని 556 ఎంపీటీసీ, 66 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. గ్రామీణ రాజకీయాల్లో పట్టు నిలుపుకునేందుకు ఇప్పట్నుంచే రంగంలోకి దిగుతున్నారు.
News December 18, 2025
టాప్-2లో నెల్లూరు జిల్లా..!

నెల్లూరు జిల్లాకు 2025-26 GDDP టార్గెట్ రూ.92,641కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.36,766కోట్లతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాకు 79/100 మార్కులొచ్చాయి. 2025-26లో రూ.2952కోట్ల పాల దిగుబడులతో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 97వేల ఇళ్లను మంజూరు చేయగా 68వేలు గ్రౌండింగ్ అయ్యాయి. 43వేల ఇళ్లను పూర్తి చేశామంటూ జిల్లా వివరాలను CMకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు.
News December 18, 2025
నాగర్కర్నూల్లో కాంగ్రెస్ హవా

నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 7 మండలాల పరిధిలోని 152 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ మద్దతుదారులు ఏకంగా 102స్థానాల్లో విజయం సాధించారు. BRS 37, BJP 1, ఇతరులు 12 చోట్ల గెలుపొందారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. చారకొండ మండలంలో మాత్రం కాంగ్రెస్, BRS మధ్య పోరు హోరాహోరీగా సాగింది.


