News February 13, 2025

పల్వంచ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ మండలానికి చెందిన కుర్ర వెంకట్(25) అనే యువకుడు 3 నెలల క్రితం చెరుకు కొట్టడానికి వచ్చి గుడిసె వేసుకున్నాడు. కాగా ప్రమాదవశాత్తు గుడిసెకు విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్‌తో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఏస్ఐ అనిల్ తెలిపారు.

Similar News

News November 18, 2025

మోక్షాన్ని పొందడమే మన ధర్మం

image

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
ఏ దేవుడు పరమతేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకు పొందదగిన స్థానము. ఆ పరాయణమ్ ఈ సృష్టిలోని సకల ప్రాణులకూ చేరుకోవాల్సిన శాశ్వతమైన గమ్యం. ఆ నిత్య తత్వాన్ని ఆరాధించి, మోక్షాన్ని పొందడమే మన ధర్మం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 18, 2025

సీఎం ప్రజావాణిలో 298 దరఖాస్తులు

image

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.

News November 18, 2025

జగిత్యాల: 28, 29 తేదీల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో నవంబర్ 28, 29 తేదీల్లో జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అన్ని పాఠశాలల నుంచి 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్‌ను 94402 12333లో సంప్రదించాలన్నారు.