News February 13, 2025
పల్వంచ: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ మండలానికి చెందిన కుర్ర వెంకట్(25) అనే యువకుడు 3 నెలల క్రితం చెరుకు కొట్టడానికి వచ్చి గుడిసె వేసుకున్నాడు. కాగా ప్రమాదవశాత్తు గుడిసెకు విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్తో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఏస్ఐ అనిల్ తెలిపారు.
Similar News
News November 17, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్తో పాటు వివిధ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
JGTL: సింగిల్ డిజిట్కు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లా చలికి వణుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్కు చేరింది. గోవిందారంలో 9℃, గొల్లపల్లి 9.9, తిరుమలాపూర్, కథలాపూర్, మన్నెగూడెం 10, మల్లాపూర్, పెగడపల్లి 10.2, రాఘవపేట 10.4, మల్యాల 10.5, ఐలాపూర్ 10.6, మేడిపల్లె, జగ్గాసాగర్ 10.7, నేరెళ్ల 10.9, పూడూర్ 11.1, రాయికల్ 11.2, కోరుట్ల, పొలాస, గోదూరు 11.3, మద్దుట్ల, అల్లీపూర్ 11.5, జగిత్యాల, సారంగపూర్లో 11.6℃గా నమోదైంది.
News November 17, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.


