News June 17, 2024

పవన్‌కు కేటాయించిన శాఖలతో పిఠాపురంలో అభివృద్ధి

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో TDP నాయకులు, కార్యకర్తలను ఆదివారం సాయంత్రం మాజీ MLA SVSN వర్మ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు రాష్ట్రం, పిఠాపురం అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఉప్పాడ, చేబ్రోలులో అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News July 8, 2025

రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News July 7, 2025

రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News July 7, 2025

రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 216 అర్జీలు

image

తూ.గో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 216 అర్జీలు అందినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల సమస్యల పరిష్కారం, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.