News February 24, 2025
పవన్ కల్యాణ్ సమావేశంలో కాకినాడ ఎంపీ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివారం కాకినాడలోని ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
REMEMBER: ఇద్దరూ సీఎంలను ఓడించిన KVR

కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. 2023 డిసెంబర్ 3న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో, ఒకే స్థానం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆయన ఓడించి సంచలనం సృష్టించారు. ఈ అపూర్వ విజయం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.
News December 3, 2025
WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.
News December 3, 2025
వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


