News February 24, 2025
పవన్ కల్యాణ్ సమావేశంలో కాకినాడ ఎంపీ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివారం కాకినాడలోని ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
భారత్ చెత్త రికార్డు

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్లో రన్స్ పరంగా భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.
News November 26, 2025
అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి: TPCC చీఫ్

దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం NZB లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీ, నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందన్నారు.
News November 26, 2025
ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


