News April 9, 2024

పవన్ కళ్యాణ్‌తో రఘురామ భేటీ

image

చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News April 10, 2025

నల్లజర్ల : చిన్నపిల్లలతో HIV ఉన్న వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News April 10, 2025

పాలకొల్లు : లవ్ మ్యారేజ్ ..మూడు నెలలకే ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.

News April 10, 2025

ప.గో జిల్లా రొయ్య రైతు ఆవేదన

image

ప.గో జిల్లాలో రొయ్య రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంటే, ఉమ్మడి ప.గో జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతూ మొదటి స్థానంలో నిలిచింది. కొనుగోలు దారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జూలై నుంచి పంట బ్రేక్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉండిలో జరగాల్సిన ఆక్వా రైతుల సదస్సు వాయిదా పడింది.

error: Content is protected !!