News March 14, 2025
పవన్ కళ్యాణ్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి

పిఠాపురంలోని చిత్రాడ వద్ద మరికాసేపట్లో మొదలుకానున్న ‘జనసేన జయకేతనం’కు ఉపముఖ్యమంత్రి హాజరుకానున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.
News December 5, 2025
ఇసుక త్రవ్వకాలు రవాణా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఇసుక త్రవ్వకాలు, రవాణా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఇసుక నిలువలు, ఇప్పటివరకు నిర్వహించిన ఇసుక లావాదేవీలు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలపై ఆయన అధికారులతో చర్చించారు.
News December 5, 2025
అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది: సీఎం

అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉందని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. భామినిలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కూడా విద్యను అత్యున్నత స్థాయిలో అందిపుచ్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పిల్లలు భారం కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్ అని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందింస్తుదన్నారు.


