News March 14, 2025

పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి

image

పిఠాపురంలోని చిత్రాడ వద్ద మరికాసేపట్లో మొదలుకానున్న ‘జనసేన జయకేతనం’కు ఉపముఖ్యమంత్రి హాజరుకానున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News November 28, 2025

తంగళ్లపల్లి: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

image

తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని చెక్పోస్టును సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News November 28, 2025

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

image

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

News November 28, 2025

పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలకు పుడా నిధులు

image

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 2.60 కోట్లు నిధులు కేటాయించింది. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ.25 లక్షలు, దాచేపల్లి రూ.25 లక్షలు, గురజాల రూ.25 లక్షలు, మాచర్ల రూ.45 లక్షలు, పిడుగురాళ్ల రూ.50 లక్షలు, వినుకొండ రూ.40 లక్షలు, చిలకలూరిపేటకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి వినియోగించనున్నారు.