News April 8, 2025
పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: రోజా

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ‘ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలి. దీర్ఘాయుష్సుతో ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News October 16, 2025
KNR: ఎల్లుండే LAST.. టెన్షన్లో ఎక్సైజ్ శాఖ..!

మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. 2024తో పోలిస్తే ఈసారి ఆశించిన మేర టెండర్లు రాకపోవడంతో ఆబ్కారీ శాఖ టెన్షన్ పడుతోంది. అయితే గతేడాది చివరిరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అలాంటి పరిస్థితే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటిదాకా KNRలో 94 WINESకు 233, PDPLలో 74కి 136, SRCLలో 48కి 226, JGTLలో 71కి 286 దరఖాస్తులు వచ్చాయి.
News October 16, 2025
ఇకపై చికెన్ షాపులకు లైసెన్సులు!

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైన్సెనింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కోడి ఏ ఫామ్ నుంచి వచ్చింది? దుకాణదారుడు ఎవరికి అమ్మారు? అనే అంశాలను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకురానుంది. గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు చికెన్ కొనేలా ప్రోత్సహించడం, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టనుంది.
News October 16, 2025
MNCL: భర్త వేధింపులు భరించలేకనే..!

నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ ప్రస్థానంలో కొనసాగిన 60 మంది మావోయిస్టులు బుధవారం గడ్చిరోలిలో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. వారిలో మంచిర్యాల(D) బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ ఉన్నారు. ఆమె పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. తల్లిదండ్రులు సరోజకు 15 ఏళ్ల ప్రాయంలో వివాహం చేశారు. భర్త వేధింపులు భరించలేక ఉద్యమానికి ఆకర్షితురాలై పోరుమార్గాన్ని ఎంచుకున్నారు.