News July 10, 2024
పవన్ నిర్ణయం.. పిఠాపురం మారేనా..?

పిఠాపురంలో రోజూ 25 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 1.3 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. అలాగే పాదగయ క్షేత్రంలో దాదాపు 1200 ప్యాకెట్ల ప్రసాదాలు విక్రయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా 1200 పీవోపీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. పిఠాపురంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించం, మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ <<13594334>>ప్రతిపాదనతో <<>>ఏ మేర మార్పు వస్తుందో చూడాలి మరి.
Similar News
News January 4, 2026
రాజమండ్రి: రౌడీ షీటర్లకు ఎస్పీ వార్నింగ్

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఆదివారం రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. పండుగ వేళ ఎటువంటి అల్లర్లు జరిగినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News January 4, 2026
RJY: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్

తూర్పుగోదావరి జిల్లాలో ‘ఆవాస్ ప్లస్’ హౌసింగ్ సర్వే పూర్తయినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 23,676 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. సొంత స్థలం ఉన్నవారు, లేనివారితో పాటు గతంలో ఇళ్లు అసంపూర్తిగా నిలిచిన వారి వివరాలను సేకరించారు. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లి సహా పలు మండలాల్లో ఈ లబ్ధిదారులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
News January 4, 2026
9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


