News January 10, 2025
పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో: బొత్స

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై MLC బొత్స సత్యనారాయణ విశాఖలో శుక్రవారం మాట్లాడారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కేసు విచారణ చేపట్టాలని కోరారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ TTD ఛైర్మన్ బీఆర్.నాయుడు స్పందించిన తీరు తనను బాధించిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావని, ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు.
Similar News
News July 6, 2025
VZM: 2,232 పాఠశాలు.. 2,10,377 మంది విద్యార్థులు

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ శనివారం తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాల నుంచి 2,10,377 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.
News July 6, 2025
ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. విజయనగరంలో 473, పార్వతీపురంలో 119, బొబ్బిలి 69, సాలూరులో 229, శృంగవరపుకోటలో 47, గజపతినగరంలో 347, చీపురుపల్లిలో 38, కొత్తవలసలో 320, కురుపాంలో 14 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
News July 5, 2025
విజయనగరం: మా భవాని ‘బంగారం’

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.