News October 18, 2024
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జ్యోతి వర్మకు బ్రాంజ్ మెడల్

ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు గోవాలో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టర్ పి. జ్యోతి వర్మ సత్తా చాటారు. మాస్టర్స్ టు విభాగంలో 69కేజీల కేటగిరి బెంచ్ ప్రెస్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ పతకం సాధించారు. గుంటూరు జిల్లాలో పవర్ లిఫ్టింగ్ చరిత్రలో నేషనల్ స్థాయిలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా జ్యోతి నిలిచారు.
Similar News
News December 1, 2025
గుంటూరులో వ్యభిచార ముఠా అరెస్ట్

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారంపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గాంధీ పార్క్ వెనుక ఉన్న రామిరెడ్డి నగర్లోని ఒక లాడ్జ్పై దాడి చేసి, ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.
News December 1, 2025
ఈ నెల 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: కలెక్టర్

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 1, 2025
GNT: మళ్లీ తెరపైకి ఆ ఎంపీ పేరు.!

2026 జూన్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్ పేరు మళ్లీ వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. పరిశ్రమలు, పెట్టుబడులపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలు, పరిపాలనలో పారదర్శకతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం మళ్లీ హైలైట్ అవుతోంది. కాగా గతంలో గుంటూరు జిల్లా నుంచి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి ఇద్దరు రాజ్యసభకి ఎన్నికవటంతో గల్లా పేరుకు ప్రాముఖ్యం ఉంది.


