News March 31, 2025
పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయి: గవర్నర్

రంజాన్ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్ భవన్ నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేసే ముస్లింలంతా భగవంతుడికి చేరువ అవుతారని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Similar News
News January 4, 2026
అంధకారంలో వెనిజులా.. స్తంభించిన జనజీవనం

వెనిజులాపై అమెరికా <<18750335>>వైమానిక దాడుల<<>> తర్వాత ఆ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రాజధాని కరాకస్ సహా ప్రధాన నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆహారం, అత్యవసర మందుల కోసం ప్రజలు బారులు తీరారు. ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి ప్రజలు రోడ్లపై పనిచేస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
News January 4, 2026
తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.
News January 4, 2026
రాంబిల్లి: అగ్ని ప్రమాదంపై కేసు నమోదు

రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్.వీ.ఎస్. ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


