News August 9, 2024
పశుగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో 21వ పశుగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్లకు ఈ నెల 6 నుంచి జరుగుతున్న శిక్షణ తరగతుల్లో ఆమె గురువారం పాల్గొన్నారు. పశు గణనకు సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఏసిహెచ్ గణేశ్ మాట్లాడుతూ.. పశువుల ఖచ్చితమైన వివరాల సేకరణకు అధునాతనమైన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామన్నారు.
Similar News
News December 19, 2025
బురుజుపేట: కనకమహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పణ

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.
News December 19, 2025
విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.
News December 19, 2025
విశాఖలో పర్యటించనున్న రక్షణ రంగ కమిటీ

రక్షణ రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు కొచ్చి, బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, వారణాసి నగరాల్లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని NSTL ప్రతినిధులతో DRDO ప్రాజెక్టుల అప్గ్రేడేషన్పై, అదేవిధంగా కోస్ట్ గార్డ్ ప్రతినిధులతో తీరప్రాంత భద్రత, రక్షణ సన్నద్ధతపై కమిటీ సభ్యులు కీలక చర్చలు జరపనున్నారు.


