News January 28, 2025

పశుపోషకులకు అండగా నిలిచేందుకే శిబిరాలు: కలెక్టర్

image

పశుపోషకులకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. ములకలూరు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. స్వయంగా నట్టల నివారణ మందును జీవాలకు ఇచ్చారు. లేగ దూడలను సంరక్షించాలని అవే రేపటి పాడిపశువులన్నారు. 1962 పశు వైద్య సంచార వాహన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్డీవో మధులత, ఎంపీడీవో,పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.

Similar News

News November 18, 2025

‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

image

AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.

News November 18, 2025

‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

image

AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.

News November 18, 2025

వైకుంఠ ద్వారా దర్శనాలపై TTD కీలక నిర్ణయం

image

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈడిప్ ద్వారా టోకెన్లు ఇస్తారు. వీళ్లను మాత్రమే మొదటి 3రోజులు దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుంది. టోకెన్లు లేకుండా భక్తులు దర్శనానికి వెళ్లవచ్చు. తిరుమల, తిరుపతి వాళ్లకు 6, 7, 8వ తేదీ ఆన్‌లైన్ టోకెన్లు ఇస్తారు.