News January 28, 2025

పశుపోషకులకు అండగా నిలిచేందుకే శిబిరాలు: కలెక్టర్

image

పశుపోషకులకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. ములకలూరు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. స్వయంగా నట్టల నివారణ మందును జీవాలకు ఇచ్చారు. లేగ దూడలను సంరక్షించాలని అవే రేపటి పాడిపశువులన్నారు. 1962 పశు వైద్య సంచార వాహన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్డీవో మధులత, ఎంపీడీవో,పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.

Similar News

News November 18, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

News November 18, 2025

RGM: సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పరిశీలించారు. గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జి వద్ద, అంతర్గాం మండలం గోలివాడ జాతర నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమాయత్తంగా ఉండాలన్నారు.

News November 18, 2025

సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.