News February 22, 2025

పశువులకు శస్త్ర చికిత్సలు అందించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలోని పశువులకు వాతావరణ మార్పులకు అనుగుణంగా అవసరమైన వైద్య చికిత్సలను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ పశు వైద్య కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. భవన పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా పశు వైద్య కార్యాలయానికి సంబంధించి ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

Similar News

News March 20, 2025

NLG: బడ్జెట్లో జిల్లాకు పెరిగిన ప్రాధాన్యం

image

రాష్ట్ర వార్షిక బడ్జెట్లో జిల్లాకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో కాస్త ఎక్కువ నిధులు కేటాయించింది. డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్ధతి కింద రూ.1,600 కోట్లు కేటాయించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 20, 2025

NLG: మే నాటికి ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి: భట్టి

image

ఈ ఏడాది మే నెల నాటికి ఉమ్మడి జిల్లాలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.

News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు కేటాయించింది. నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు ఇవ్వగా.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.1715కోట్లు దక్కాయి. పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు ఇచ్చింది. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.

error: Content is protected !!