News March 19, 2025

పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

image

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్‌కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.

Similar News

News October 21, 2025

BREAKING: HYD: అల్కాపురి టౌన్‌షిప్‌లో యాక్సిడెంట్

image

HYD పుప్పాలగూడ పరిధి అల్కాపురి టౌన్‌షిప్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే నవీన్, తన కుమారుడు కుశల జోయల్‌తో కలిసి వస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

News October 21, 2025

HYD: ప్రభుత్వం వద్దకు మెట్రో.. సిబ్బందిలో టెన్షన్..!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టులో 1,300 మంది రెగ్యులర్ స్టాఫ్, 1,700 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మెట్రో రైల్ నిర్వహించే ఎల్ అండ్ టీ సంస్థకు ఫ్రాన్స్ సంస్థ కియోలిస్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న స్టాఫ్ తమ పరిస్థితి ఏమిటో అని ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

News October 21, 2025

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.