News March 19, 2025
పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.
Similar News
News February 26, 2026
కర్నూలు జిల్లాలో 293 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 293 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐవో లాలప్ప తెలిపారు. మొత్తం 21,428 మంది విద్యార్థులకు గానూ 21,135 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షల పట్ల సందేహాలు ఉంటే ఆర్ఐవో కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
News February 26, 2026
రాష్ట్రానికి రూ.2,160 కోట్లు?

TG: PMAY-అర్బన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 1.3 లక్షల యూనిట్లు మంజూరవడంతో ₹1,695 కోట్లు అందనున్నాయి. అలాగే PMAY-గ్రామీణ్ పథకం కింద 3 లక్షల యూనిట్లు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే మరో ₹2,160 కోట్లు అందనున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బూస్ట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
News February 26, 2026
జగిత్యాల: ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ జి.నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి 1న ఉదయం 10 నుంచి 1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. హాల్ టికెట్, ఆధార్ కార్డు ఉంటేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు.


