News March 14, 2025

‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

image

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.

Similar News

News January 7, 2026

WNP: నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై ఉక్కుపాదం: కలెక్టర్

image

సకాలంలో సీఎంఆర్ ధాన్యం సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు వేగంగా నగదు పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రైతులకు నగదు పెండింగ్ ఉందని వారికి వేగంగా నగదు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 7, 2026

‘ఏంజీఎన్ఆర్ఈజీఎస్ పనులను వేగంగా పూర్తి చేయాలి’

image

సిద్దిపేట జిల్లాలోని ఏంజీఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్మాణంలో ఉన్న పనులు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల గూర్చి ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా గ్రామంలో ఏంజీ ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులు అంగన్వాడి భవనాలు, గ్రామపంచాయతీ భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 7, 2026

3 రోజుల్లో అన్నమయ్య జిల్లాలో వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.